అమరావతి : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్పై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా దవాఖానకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు ఆరోపణలపై విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రభాకర్ను బదిలీ చేశారు. ఓ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగు చూడడం, తదనంతర పరిణామాలతో ప్రభుత్వం అతడిని జీజీహెచ్ సూపరింటెండెంట్ విధుల నుంచి తప్పించి విచారణకు కమిటీ వేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.