అమరావతి : ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( AP EAPCET 2021 ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం విడుదల చేశారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల కాగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు.