శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో 2006లో ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఆ విషాద ఘటలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైనా అనే స్థానిక యువ రిపోర్టర్.. ఆ దుర్ఘటనను గుర్తు చేస్తూ తన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ జర్నలిస్టుపై కేసు బుక్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. తనపై నమోదు అయిన కేసును ఎత్తివేయాలని పోలీసుల్ని కోరారని, కేవలం స్టేటస్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సాజిద్ తెలిపాడు. 23 ఏళ్ల సాజిద్పై కేసు పెట్టడాన్ని పోలీసులు సమర్థించారు. జర్నలిస్టు అన్న కోణంలో ఆ కేసు నమోదు కాలేదని, కానీ అతను ఆ స్టేటస్ పెట్టిన ఉద్దేశంతో, దాంట్లో ఉన్న కాంటెంట్ ఆధారంగా తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.