అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్(12), క్రిస్గేల్(13) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఏడు ఓవర్లకు పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. రెండు వికెట్లను పేసర్ రబాడ పడగొట్టాడు. ప్రస్తుతం డేవిడ్ మలన్(3), మయాంక్ అగర్వాల్(19) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో తాత్కాలికంగా జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్న అగర్వాల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు.