అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ టీకాలు అందాయి. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్జిన్ డోసులను తరలించారు. టీకా నిల్వ కేంద్రం నుంచి జిల్లాల వారీగా వ్యాక్సిన్ను తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
ఏపీలో కొవిడ్ టీకాల నిల్వలు నిండుకున్నాయని, మరికొన్ని డోసులు కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అదనపు టీకా డోసులను కేటాయించడంతో అవి ఇవాళ రాష్ట్రానికి చేరాయి.
రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో మొదటగా హెల్త్కేర్ వర్కర్స్కు అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్కి వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17, 18న ఏపీకి 8 లక్షల కోవిషీల్డ్ డోసులు అందాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి