అమరావతి : కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి ఈ టీకాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ నుంచి ఆయా జిల్లాలకు పంపిణీ నిమిత్తం తరలిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.