అమరావతి : ఆంధ్రప్రదేశ్కు మరో 3.60 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను శనివారం కేంద్రం పంపింది. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి సాయంత్రానికి గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్ డోసులు చేరాయి. ఆరోగ్యశాఖ అధికారులు వీటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఆయా జిల్లాలకు అవసరాలకు అనుగుణంగా వీటిని సరఫరా చేస్తారు. రాష్ట్రంలో కొన్నాళ్లుగా వ్యాక్సిన్ కొరత ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అందిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది. చాలా మందికి రెండో డోసుతోపాటు తొలిడోసు వ్యాక్సిన్ వేసేందుకు అవకాశం ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.