అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం ఈ రెండు పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను మొదట విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని నిరంజన్ రెడ్డి పిటిషనర్ల తరఫున కోర్టును అభ్యర్థించారు.
సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ విచారణ జరిగింది. ఈ క్రమంలో మొదట సీబీఐ కేసులు లేదా రెండూ సమాంతరంగా విచారణ జరపాలని కోరారు. సీబీఐ, ఈడీ కేసులు రెండూ వేర్వేరని కోర్టుకు తెలిపారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా మనీలాండరింగ్ అభియోగాలపై విచారణ జరపవచ్చన్నారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ ఛార్జ్షీట్లపై విచారణ జరపాలని అదనపు సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.