అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ పనుల నిర్వహణకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.125.30 కోట్లు కేటాయించింది.
10 లక్షల జనాభా దాటిన నగరాల్లో పారిశుధ్య నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ కోసం రూ.9.69 కోట్లు కేటాయించింది.
నిధుల విడుదలపై స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి