అమరావతి : ఏపీలో కరోనా కర్ఫ్యూ వేళలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిడ్పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21 నుంచి 30 వరకు సడలింపులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంటుంది. కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు.