అమరావతి : ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని ఆ రాష్ఠ్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
విద్యార్థులను తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పార్టీల నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.