అమరావతి : ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈస్టు గోదావరి మినహా మిగిలిన జిల్లాల ఉద్యోగులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనివేళలుగా సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పనివేళలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.