అమరావతి : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా వీరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మెడికల్ బోర్డును సైతం ఏర్పాటు చేసింది. వివిధ పరీక్షల్లో ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఈ ప్రత్యేక మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. గుంటూరు ప్రభుత్వ దవాఖానలో వీరికి వైద్య పరీక్షలు చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.