అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తొలి విడత కరోనా టీకా తీసుకున్న వైద్య సిబ్బందికి రెండో డోసు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో వ్యాక్సినేషన్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ టీకా పర్యవేక్షణ యాప్ అందుబాటులోకి రానున్నది.
లబ్ధిదారుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఈ యాప్లో పొందుపరుస్తారు. రిజిస్ట్రేషన్ ఐడీ, మొబైల్ నెంబర్, పేరు ద్వారా లబ్ధిదారుల వివరాలను పరిశీలించేందుకు వీలుంది.
ఈ నెల 20లోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి