చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తాను ఒకే ఫ్రాంఛైజీ తరఫున 100 మ్యాచ్లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చాహల్ 100వ టీ20 మ్యాచ్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అనుభవజ్ఞుడైన లెగ్స్పిన్నర్ చాహల్ 2011 సీజన్లో మొట్టమొదటిసారి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2014లో బెంగళూరు టీమ్లోకి వచ్చాడు.
14వ సీజన్లో భాగంగా బెంగళూరు బుధవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చాహల్కు 100వది కావడంతో మిస్టర్ నాగ్స్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విటర్లో షేర్ చేసింది. గత కొన్నేండ్లుగా బెంగళూరు టీమ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తర్వాత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.