అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 58 మంది మరణించారు. 7,728 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,32,902కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 69,831.
జిల్లాల వారీగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో అత్యధికంగా 12 మంది చనిపోగా ప్రకాశంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, అనంతపూర్, కృష్ణ, పశ్చిమగోదావరిలో నలుగురు చొప్పున, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ముగ్గురు చొప్పున, కర్నూల్, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు.