అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,018 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్-19తో 96 మంది మృతిచెందారు. కాగా 19,177 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,03,787కు చేరుకుంది. కొవిడ్తో ఇప్పటివరకు రాష్ట్రంలో 9,173 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలో 11 మంది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో 10 మంది చొప్పున, విజయనగరంలో 9 మంది, చిత్తూరు, కృష్ణలో 8 మంది చొప్పున, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున, కడపలో నలుగురు మృత్యువాతపడ్డారు.