అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల్లో కూడా భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 20,345 కొత్త కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలిపింది.
కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 13,22,934కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 108 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,899కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 14,502 మంది కరోనా బారి నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 11,18,933కు చేరింది. ఇదిలావుంటే ఏపీలో ప్రస్తుతం 1,95,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి.