అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. 4,421 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 10,20,926 చేరింది, మొత్తం మరణాలు 7616. యాక్టివ్ కేసులు 81,471.
జిల్లాల వారీగా తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు, అనంతపూర్, చిత్తూర్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు, ప్రకాశం ఒక్కరు చొప్పున మరణించారు.