అమరావతి : కొవిడ్ రోగుల నుంచి భారీగా ఫీజు వసూలు చేసిన ఓ దవాఖానకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది. బాధితులను నుంచి అధిక ఫీజులు దండుకున్న విజయనగరంలోని పీజీ స్టార్ దవాఖానకు రూ. 10 లక్షల జరిమానా వేసింది. పీజీ స్టార్ దవాఖాన నిర్వాహకులు కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ నిర్వహించిన అధికారులు మంగళవారం దవాఖానను తనిఖీ చేశారు. తనిఖీల్లో సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి అధికారులు జరిమానా విధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.