అమరావతి : నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య వారం రోజుల తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేసింది. దీంతో ఆయన నెల్లూరు వెళ్లి అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. ఇవాళ ఆయన స్వగ్రామం కృష్ణపట్నం రావడంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది. వారం తర్వాత ఇంటికి వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆనందయ్య నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి వాహనాల రాకపోకలను నిషేధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.