అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో పండ్ల ధరలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మామిడి ధరలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు.
మామిడి ప్రాసెసింగ్ యూనిట్స్ ధరల విషయంలో రైతులకి న్యాయం చేసేట్లు వ్యవహరించాలని, ఉద్దేశపూర్వకంగా ధరల్ని మాత్రం తగ్గించవద్దని,కృష్ణా జిల్లాలోని నున్న మార్కెట్తో పాటుఇతర మార్కెట్లలోకి రైతులు రాత్రులు కూడా సరుకులు తీసుకురావచ్చిన, సరుకులు దించిన తర్వాత తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
టమోటా ధరలు కూడా పడిపోకుండా చూసుకోవాలని, 2000 టన్నుల టమోటాలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఉద్యానవన ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా కర్ఫ్యూ నిబంధల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి కన్నబాబు వివరించారు.