శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్ర పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని వక్తలు అన్నారు. శనివారం చెన్నారెడ్డి పదవి విరమణ సభకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ భట్టు రమేష్తోపాటు దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు, పూర్వ పీఠాధిపతి ఆచార్య జీ వెంకటరామయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా దేవస్థానం పరివార ఆలయాల్లో బయల్పడుతున్న పురాతన శాసనాలు తదితర విషయాల్లో చెన్నారెడ్డి అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. అనంతరం చెన్నారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటానికి బహూకరించారు. వేదపండితులు వారి వేదాశీర్వచనాలు అందించారు. సమావేశంలో విస్ఓమ్ స్కూల్స్ చైర్మన్ మక్బూల్ హుస్సేన్, పురావస్తుశాస్త్ర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.