ఢిల్లీ,జూలై 6: లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలుగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ new-2021మోడల్ ఎవోక్ ఎస్యూవీ రేంజ్ రోవర్ ను లేటెస్ట్ డిజైన్, ,మోడ్రన్ లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లతో అప్గ్రేడ్ చేశారు. “రేంజ్ రోవర్ ఎవోక్ ప్రత్యేకమైన, స్మార్ట్ డిజైన్తో వస్తుందని, ఈ కారులో కొత్త ఇంటీరియర్ డిజైన్, సరికొత్త ల్యాండ్ రోవర్ టెక్నాలజీలు,పవర్ఫుల్ ఇంజన్లను ప్రవేశపెట్టామని,ఇది సమర్థవంతంగా ఉంటుందని ” జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్,మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి అన్నారు.
కొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ఈ వేరియంట్ (ఇంజినియం 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్) ,ఎస్ వేరియంట్ (2.0 లీటర్ డీజిల్ ఇంజన్) ఆప్షన్లలో లభిస్తుంది. భారతదేశంలో కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.64.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఈ పవర్ఫుల్ ఎస్యూవీలోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 కిలోవాట్ పవర్ని,365 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 150 కిలోవాట్ల పవర్ ని 430 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ ఎస్యూవీలో కంపెనీ 3డి సరౌండ్ కెమెరా, పిఎమ్ 2.5 ఫిల్టర్తో క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్, ఫోన్ సిగ్నల్ బూస్టెరాండ్తో కూడిన వైర్లెస్ డివైస్ ఛార్జింగ్,కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ ఎస్యూవీలో మొట్టమొదటిసారిగా డీప్ గార్నెట్,ఎబోనీ అని పిలిచే కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలర్ ఆప్షన్ను ప్రవేశపెట్టారు. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఈ విభాగంలో వోల్వో ఎక్స్సి60 ,మెర్సిడెస్ జిఎల్సి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ ,మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి ఆశాభావం వ్యక్తం చేశారు.
-న్యూ రేంజ్ రోవర్ ఎవోక్-రూ .64.12 లక్షలు
– డిస్కవరీ స్పోర్ట్ – రూ .65.30 లక్షలు
– న్యూ రేంజ్ రోవర్ వెలార్ -రూ.79.87 లక్షలు
-డిఫెండర్ 110 -రూ .83.38 లక్షలు
-రేంజ్ రోవర్ స్పోర్ట్ -రూ.91.27 లక్షలు
-రేంజ్ రోవర్ – రూ.2.11 కోట్లు
-రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీఆర్-రూ .2.19 కోట్లు