అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 380 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 70 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది.