అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 85,311 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 24 గంటల్లో కొవిడ్ వల్ల 83 మంది ప్రాణాలు కోల్పోగా 15,469 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1738990కు చేరింది. ప్రస్తుతం 133773 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1593921 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11296కు పెరిగింది.