అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 88,441 శాంపిల్స్ పరీక్షించగా మరో 10,373 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే కొవిడ్ వల్ల 80 మంది చనిపోయారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11,376కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,28,108 కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1749363కు చేరింది. ఇప్పటి వరకు 1609879 మంది కరోనా నుంచి కోలుకున్నారు.