హైదరాబాద్ : రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నగరంలోని ఎల్బీనగర్ డివిజన్ కొత్తపేటలో కొందరు రెమిడిసివేర్ ఇంజక్షన్లలను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు (ఒక్కొక్కటి రూ. 35 వేలకు) విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది.
ఈ మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఓ కరోనా బాధితుడి కుటుంబానికి ఇంజక్షన్లు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి నుంచి 5 రెమిడిసివేర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దందాకు పాల్పడుతున్నది నాగరాజు( హెటిరో ఉద్యోగి) , రమేష్ ( ఓ ప్రైవేటు హాస్పిటల్ ఉద్యోగి)గా గుర్తించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తెలిపారు.