గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ 80 ఏండ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కిష్కిందపాలేనికి చెందిన సీతమ్మ అనే వృద్ధురాలు 15 ఏండ్ల క్రితం కూలీ పనుల నిమిత్తం వచ్చి కామాక్షినగర్లో నివాసం ఉంటున్నది. ఏడాది క్రితం ఆమె భర్త మృతి చెందగా.. బిడ్డ కొడుకు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
వృద్ధురాలు ఒంటరిగా ఉన్నది గమనించి గుర్తు తెలియని వ్యక్తి గత శుక్రవారం రాత్రి ఆమె ఇంటి తలుపు తట్టాడు. దాంతో కొడుకు వచ్చాడనుకున్న వృద్ధురాలు తలుపులు తీయడంతో నిందితుడు ఆమెపై లైంగిక దాడిచేసి పారిపోయాడు. అనంతరం సీతమ్మ స్థానికులకు విషయం తెలియజేయడంతో వారు ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో