హైదరాబాద్ : సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మహిళా పోలీస్ భద్రతా విభాగం ఆధ్వర్యంలో యంగిస్థాన్ ఫౌండేషన్ సహకారంతో ఇవాళ వర్చువల్గా సైబ్హర్-3 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 1650 పాఠశాలల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ పాఠాలు వినే క్రమంలో విద్యార్థులు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్ నెట్ వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థులు తోటి వారికి అవగాహన కల్పించాలన్నారు. సైబ్హర్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగిస్థాన్ ఫౌండేషన్ను ఆయన అభినందించారు.