కరీంనగర్ : హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. శుక్రవారం ఇల్లంతకుంట మండలం చిన్నకోమటిపల్లెలో ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఈటల రాజేందర్ ప్రలోభపెట్టి ఓట్లు కొనాలని చూస్తున్నారు. దళితుల భూములు లాక్కోవడం తప్పు అని చెప్పినందుకు సీఎం కేసీఆర్, పార్టీ పై దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు.
హుజురాబాద్ ప్రజలు మోసగాళ్లను నమ్మే పరిస్థితులు లేవన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు మంత్రి పదవులిస్తే ఆస్థులు సంపాదించడమే తప్ప ప్రజా సంక్షేమం కోసం పని చేయలేదన్నారు. కేసీఆర్ సొంత తమ్ముడిలా భావిస్తే ఈటల మోసం చేశాడని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
కరోనా టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయా.. ?