సికింద్రాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 28: సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్ పరిధిలో రూ.కోటి 45 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణికేశ్వరీనగర్, రవీంద్రనగర్, లాలాపేట, శాంతీనగర్, సిరిపురి కాలనీ తార్నాక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులతో పాటు మాణికేశ్వరీనగర్లో వర్షపు నీటి కాలువ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మోతె శ్రీలత శోభన్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్ : జంటనగరాలకు చెందిన పాన్షాపు నిర్వాహకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. సోమవారం సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో ఫెడరేషన్ ఆఫ్ పాన్షాప్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యాదర్శి మహ్మద్ సల్లాఉద్దీన్ ఆధ్వర్యంలో పాన్షాపుల నిర్వాహకులు పద్మారావు గౌడ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కొంతకాలంగా తమపై వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.