గుంటూరు : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు విద్యుత్ షాక్తో మరణించారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టపై నిద్రిస్తున్న సమయంలో వీరిపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాపలాదారులు మృతి చెందిన విషయాన్ని స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను ఒడిశా వాసులైన రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.