అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది మరణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,67,017కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 49,683 గా ఉంది.
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అధికంగా 10 మంది చనిపోగా తూర్పుగోదావరి, కృష్ణాలో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విశాఖపట్నం, విజయనగరంలో ఒక్కో వ్యక్తి చొప్పున మరణించారు. గత 24 గంటల్లో తూర్పుగోదావరిలో అత్యధికంగా 943 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 853, పశ్చిమ గోదావరిలో 598, శ్రీకాకుళంలో 500 కేసులు నమోదయ్యాయి.