అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 36 మంది మరణించారు. 7,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 51,204 గా ఉంది. కొవిడ్తో ఇప్పటివరకు ఏపీలో మొత్తం 12,452 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అధికంగా 8 మంది మృతిచెందగా తూర్పుగోదావరి, కృష్ణాలో ఐదుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, కర్నూలు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందారు.