అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,569 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,114 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 18,14,413కు పెరిగింది. వీరిలో 17,22,381 మంది కోలుకున్నారు. మరో 80,013 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 11,999 మంది మరణించారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 87,756 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.