ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
అభివృద్ధి పనులకు భూమిపూజ
జడ్చర్ల, జూన్4: జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. 24వ వార్డులో రూ.10లక్షలతో సీసీరోడ్డు, రాఘవేంద్రస్వామి దేవాలయం వెనుక ప్రాంతంలో రూ.10లక్షలతో నిర్మించే అండర్డ్రైనేజీ పనులకు, పాతబజార్ జవహార్నగర్లో రూ.5లక్షలతో నిర్మించే అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ సారిక, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ మురళీ, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, లత, రమేశ్, ఉమాశంకర్గౌడ్, బృందంగోపాల్, రాంమోహన్, కొండల్, లక్ష్మీనర్సింహారావు, వెంకటేశ్, శ్రీశైలంయాదవ్, సారంగి నవీన్, పర్మటయ్య ఉన్నారు.
నాణ్యమైన ఎరువులు,విత్తనాలు విక్రయించాలి
నవాబ్పేట, జూన్ 4: ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఎమ్మెల్యే డా.సీ.లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కూచూర్ గ్రామంలో శుక్రవారం మహాలక్ష్మి ఫర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, దుకాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచులు పిట్టల లక్ష్మమ్మ, యాదయ్య, లక్ష్మారెడ్డి, నాయకులు నాగిరెడ్డి, పిట్టల రవి, భోజయ్యచారి, కారూర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.