న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2427 మంది మృతిచెందారని, కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు.
ఇక దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 36,63,34,111 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,87,589 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.