అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 21 మంది చనిపోయారు. 4,019 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,336కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,356గా ఉంది.
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మృతుల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, తూర్పు గోదావరిలో నలుగురు చొప్పున, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, కర్నూల్, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.