అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలంలోని తీగలవలస శివారులోని జలపాతంలో సరదాగా స్నానం చేస్తూ నీటి ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు వీరిని రక్షించేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. గల్లంతైన ముగ్గురిని హుకుంపేట మండలం సన్యాసిపాలెం వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతవరకు గల్లంతైన వారి ఆచూకీ లభించలేదని తెలిపారు. ముగ్గురు నీటమునిగి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలంలో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.