అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని వాంబే కాలనీ-డీ బ్లాక్లో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నీలవేణి, ఝాన్సీ, సాయిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి భర్త మోహన్ వారిని హత్య చేసిఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..