అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 246 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 131 మంది కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,986కు చేరింది. 8,83,890 చికిత్సకు కోలుకున్నారు. మరో 1909 యాక్టివ్ కేసులుండగా.. ఇవాళ్టి వరకు 7187 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 31,546 శాంపిళ్లను పరీక్షించారు. నేటివరకు 1,46,74,210 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.