ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 23,920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడిన వారిలో 11,411 మంది కోలుకున్నారు. 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 11,45,022కు పెరిగాయి. 1,43,178 యాక్టివ్ కేసులున్నాయి.
మరణించిన వారి సంఖ్య 8,136కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 9,93,708 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 1,14,299 శాంపిళ్లనుపరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.