అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24గంటల్లో కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 18,832 మంది కోలుకున్నారు. 92 మంది మృతి చెందారు.
ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 12,87,603కు పెరిగాయి. ఇప్పటివరకు 10,88,264 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు మొత్తం 1,90,632కు చేరాయి. 8707 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ 1,05,494 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.