ముంబై : వైద్య అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని ఓ దవాఖానలో ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలతో ఇద్దరు రోగులు మరణించారు. సాంకేతిక కారణాలతో దవాఖాన అంతటా ఆక్సిజన్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడ్డాయి.
సమస్యను పరిష్కరించాలని రోగుల బంధువులు ఆస్పత్రి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినా పరిస్ధితిని చక్కదిద్దడంలో జాప్యంతో ఇద్దరు రోగులు మరణించారు. మరోవైపు కొవిడ్-19 తీవ్రతతో మహారాష్ట్రలో పదిహేను రోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధించేందుకు కసరత్తు సాగుతోంది. ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్డౌన్ వర్తింపచేయవచ్చని భావిస్తున్నారు.