ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో చేసుకున్న సెలబ్రేషన్స్ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో పృథ్వీని పైకి ఎత్తడానికి ప్రయత్నించిన ధావన్.. తన వల్ల కాక కిందికి దింపేశాడు. ఇదే విషయాన్ని కామెంట్లో రాస్తూ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ధావన్.
ఈ మ్యాచ్లో పృథ్వీ కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేయగా.. ధావన్ 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. దీంతో 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేజ్ చేసింది.