కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లోకి ప్రవేశించి ఉగ్రరూపం దాలుస్తూ భయం గొలుపుతున్నది. గతంలో మాదిరిగా లాక్డౌన్ ప్రకటిస్తారా?వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవడమెందుకు? వంటి భిన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. కరోనా విసురుతున్నసవాలును ఎదుర్కొనడానికి రెండు రకాలుగా ఆలోచించవలసి ఉన్నది. ఒకటి ఆరోగ్య కోణంలో కాగా, మరొకటి ఆర్థిక కోణంలో. ఈ రెండు కోణాలలో ఆలోచించినప్పుడు మనకు స్పష్టమయ్యేదేమిటంటే- ప్రజలు కరోనాపై దీర్ఘకాలిక పోరుకు సమాయత్తం కావల్సి ఉంది.
సాధారణంగా గతంలో కరోనా సోకిన వ్యక్తి రోగనిరోధక శక్తిని పొంది ఉంటాడు. వ్యాక్సిన్ వల్ల కూడా రోగనిరోధకత లభిస్తుంది. కానీ ఆర్ఎన్ఏ జన్యు ఆధారిత వైరస్లు త్వరితగతిన రూపాంతరం చెందుతుంటాయి. ఒక్కోసారి ఉత్పరివర్తనం చెందిన వైరస్ రోగనిరోధక శక్తిని అధిగమించి మళ్లీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ప్రతీ వైరస్ మ్యుటేషన్ ప్రమాదకరమైంది కాకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అది మునుపటి వైరస్ కంటే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. కరోనా వైరస్ అన్నిరకాల మ్యుటేషన్లకు సంబంధించిన రోగ నిరోధక శక్తి మనిషికి వచ్చేవరకు థర్డ్, ఫోర్త్ వేవ్లు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.
కరోనా వైరస్ జన్యు పరిణామాన్ని అనుసరించి దాదాపు అన్ని మ్యుటేషన్లు పూర్తి చేసుకోవడానికి మూడేండ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల కరోనా వైరస్పై దీర్ఘకాలిక పోరాటానికి మనం సిద్ధపడాలి.భారత ఆర్థికరంగ పరిశోధన, పర్యవేక్షణ సంస్థ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ రిసెర్చ్) వెల్లడించిన సమాచారం ప్రకారం- కరోనా ముందు వ్యవసాయేతర ఉపాధి ఎంత ఉండేదో, అంతటి స్థాయికి ఇంకా చేరుకోలేదు. 2020లో కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దెబ్బ నుంచి మన దేశం ఇంకా తేరుకోక ముందే సెకండ్ వేవ్ వచ్చిపడింది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధిస్తే దేశంలోని అశేష ప్రజానీకం కోలుకోలేని విధంగా నష్టపోతుంది. బ్రెజిల్ వంటి దేశాల్లో నిరుద్యోగం, కరువు కాటకాలు విలయ తాండవం చేస్తున్నాయి. అక్కడి ప్రజానీకానికి తినడానికి తిండి లేని పరిస్థితి దాపురించింది. అటువంటి పరిస్థితులు నివారించాలంటే మన దేశంలో వీలైనంత మేరకు లాక్డౌన్ విధించకపోవడమే శ్రేయస్కరం.
కరోనా నిరోధక చర్యల విషయమై కొందరు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కానీ ఈ సందర్భంలో రాష్ర్టాలకు అవసరమైన వనరులను, ఇతర హంగులను కేంద్రం సమకూర్చాలనే విషయాన్ని కూడా గుర్తిస్తే బాగుంటుంది.ప్రజలకు తమ బాధ్యత లను కూడా గుర్తు చేయాలి. ప్రభుత్వాలు ప్రజలకు కావలిసిన ఏర్పాట్లు చేస్తూనే, ప్రజల అనవసరమైన కదలికలను పరిమితం చేయాలి. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2020లో లాక్డౌన్ విధించిన సందర్భంలో ప్రధానితో ‘హెలికాప్టర్ మనీ’ గురించి ప్రస్తావించి, ఆ రూపంలో డబ్బును పంపిణీ చేయాలని సూచించారు. కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్తలు రఘురాం రాజన్, అభినవ్ బెనర్జీ, అమర్త్యసేన్ వంటివారు, భారత దేశ ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బు చేరవేయడం ద్వారానే డిమాండ్ పెరిగి కరోనా సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ బయట పడవచ్చునని సూచించినప్పటికీ, అలాంటి సూచనలను కేంద్రం అమలుపరచలేదు.
పీడీఎస్ ద్వారా రేషన్ సప్లయి చేయడం, లోన్ ఈఎంఐని వాయిదా వేయడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొత్త లోన్లు ఇవ్వడం, చాలా చిన్న మొత్తంలో ప్రజలకు, రాష్ర్టాలకు ఆర్థిక వెసులుబాటు కలిపించడం, రాష్ర్టాల రుణ పరిమితి పెంచడం మినహా, కేంద్రం ఇతర అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలు తీసుకున్న చర్యలేవీ తీసుకోలేదు. ఇటువంటి విషమ సందర్భంలో లాక్డౌన్ కనుక విధిస్తే, ఆ చర్య సామాన్య ప్రజానీకానికి శరాఘాతంగా మారవచ్చు.
సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న సందర్భంగా ప్రజల పట్ల, రాష్ర్టాల అవసరాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో సహృదయతతో వ్యవహరించాలి.
2020లో కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దెబ్బ నుంచి మన దేశం ఇంకా తేరుకోక ముందే సెకండ్ వేవ్ వచ్చిపడింది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధిస్తే దేశంలోని అశేష ప్రజానీకం కోలుకోలేని విధంగా నష్టపోతుంది. బ్రెజిల్ వంటి దేశాల్లో నిరుద్యోగం, కరువు కాటకాలు విలయ తాండవం చేస్తున్నాయి. అక్కడి ప్రజానీకానికి తినడానికి తిండి లేని పరిస్థితి దాపురించింది.అటువంటి పరిస్థితులు నివారించాలంటే మన దేశంలో వీలైనంత మేరకు లాక్డౌన్ విధించకపోవడమే శ్రేయస్కరం.
కరోనా విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. రాష్ర్టాలకు ప్రత్యేక నిధులను కేంద్రం సమకూర్చాలి. కేవలం రుణ పెంపుదలతో సరిపెట్టకూడదు. కరోనా నిరోధక చర్యల విషయమై కొందరు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కానీ ఈ సందర్భంలో రాష్ర్టాలకు అవసరమైన వనరులను, ఇతర హంగులను కేంద్రం సమకూర్చాలనే విషయాన్ని కూడా గుర్తిస్తే బాగుంటుంది. ప్రజలకు తమ బాధ్యత లను కూడా గుర్తుచేయాలి. ప్రభుత్వాలు ప్రజలకు కావలిసిన ఏర్పాట్లు చేస్తూనే, ప్రజల అనవసరమైన కదలికలను పరిమితం చేయాలి. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలి.
ఒకవైపు కరోనాను ఎదుర్కొనడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్థిక రథాన్ని ముందుకు నడిపించాలి.మాస్క్లు ధరించడం, సామాజిక దూరం వీలైనంతవరకు పాటించడం ద్వారా, తమను తాము రక్షించుకుంటూనే దేశాన్ని రక్షించడం తమ బాధ్యత అని ప్రజలు గుర్తించాలి. సీఎం కేసీఆర్ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని ఆదుకోవాలనే సహృదయంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు నెలకు రెండు వేల రూపాయల నగదు, 25 కిలోల బియ్యం సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కరోనా వ్యాప్తిని నివారించేందుకు గ్రామాల్లోనే యాసంగి పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఈ చర్య కరోనా వ్యాప్తిని అరికట్టడమే కాకుండా, రైతన్నలకు చేయూతనందిస్తుంది. ఇటువంటి ప్రజానుకూల చర్యల ద్వారా ఇతర రాష్ర్టాలకు తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నది.
–పెండ్యాల మంగళా దేవి