మానకొండూర్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ‘విజ్ఞాన్ ప్రసార్ ’ ఐఐసీటీ హైదరాబాద్లో ఏప్రిల్ 8న నిర్వహించనున్న ‘సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్సైన్షన్’ (స్కోప్) సమావేశానికి కరీనంగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న టీచర్ బీ ఓదెలు కుమార్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు బుధవారం సంస్థ బాధ్యులు ఆయనకు సమాచారం ఇచ్చారు.
కుమార్ పచ్చునూర్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్)గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓదెలు మాట్లాడారు. స్కోప్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొదించేందుకు ప్రాంతీయ భాషాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. ఈయేడు తెలంగాణ తెలుగు భాషాలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన కోసం తనను ఆహ్వానించిందని చెప్పారు.