ముంబై : రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలన్నీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాకే సహా అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపారని, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల మంచి కోసం నిర్ణయం తీసుకుందని.. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందన్నారు. ‘కరోనా కేసుల పెరుగుదలపై ప్రధాని సైతం చాలా ఆందోళన చెందుతున్నారని నేను భావిస్తున్నాను’ అన్నారు. వైరస్ ఉధృతి నేపథ్యంలో లాక్డౌన్ విధించాలని గుజరాత్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘పరిస్థితిని అదుపు చేసేందుకు లాక్డౌన్ సముచితమైందని హైకోర్టు సైతం గుర్తించింది’ సంజయ్రౌత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన ఆంక్షలు పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్రసింగ్ ఫడ్రవీస్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. అన్ని విషయాలపై సమాజంలోని అన్ని వర్గాలతో మళ్లీ చర్చించాలని, సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయకుండా ఆంక్షలు విధించాలని ఫడ్నవీస్ కోరారు. ఏప్రిల్ 30 వరకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘బ్రేక్ ది చైన్’ కింద కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మంగళవారం 55,469 కరోనా కేసులు నమోదవగా.. 297 మంది మృత్యువాతపడ్డారు.