మెదక్, ఏప్రిల్ 5 : ఎన్నో ఉన్నత శాఖలు సమర్ధవంతంగా నిర్వహించిన వ్యక్తి, మొదటి దళిత ఉప ప్రధానిగా పనిచేసి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుబావుడు బాబు జగ్జీవన్రామ్ అని కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. జగ్జీవన్రాం జయంతి సందర్భం గా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అణగారిన వర్గాల అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల నుంచి ఉన్నత చదువులు చదివి బీహార్ నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. జనం కోసమే జీవితం అంకితం చేసి పోరాడిన మహనీయుడు అని, బంగ్లాదేశ్ ఇండియా యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా, 1967-68లో తీవ్ర కరువు కాలంలో వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారన్నారు. మొదటిసారిగా ఆల్ ఇండి యా డిప్రెస్ అండ్ క్లాసెస్ లీగ్ను ఏర్పాటు చేసిన వ్యక్తి జగ్జీవన్రామ్ అన్నారు. వారి ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు సహాయ సంచాలకులు గంగయ్య, అధికారులు, సిబ్బంది జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నివాళులర్పించిన ఎంపీ బీబీ పాటిల్
మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హైదారాబాద్లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
తేయాకు తోటలో 20 కిలోల కాలనాగు కలకలం..!
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్బై